బ్రేకింగ్: భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోలు మృతి

-

గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతం మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్న మావోయిస్ట్ పార్టీకి మహారాష్ట్రలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. పోలీసు కాల్పుల్లో 8 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎంత మంది మావోయిస్ట్ లు మరణించారు అనేది ఇంకా పూర్తి స్పష్టత లేదు. ఇక ఎంత మంది గాయపడ్డారు అనే సమాచారం కూడా లేదు.

ఇంకా ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి మావోయిస్ట్ పార్టీ కరోనాతో కూడా ఇబ్బంది పడుతుంది. దాదాపుగా 100 మంది మావోయిస్ట్ అగ్ర నేతలు కరోనా బారిన పడ్డారని పోలీసులకు సమాచారం అందింది. కరోనా నుంచి కోలుకోవడానికి ఫ్రీ చికిత్స అందిస్తామని పోలీసులు ప్రకటనలు కూడా చేయగా కొందరు మావోలు లొంగిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version