క్రికెట్ ఫాన్స్ కు షాక్..ఐపీఎల్​-2022 కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం!

-

ఐపీఎల్ 15 వ సీజన్ కు ముహూర్తం దగ్గరపడుతోంది. ఈసారి తొందరగా ఐపీఎల్ ప్రారంభించాలని బిసిసిఐ సన్నాహాలు చేస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో ఐపీఎల్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ చివరిదశ మ్యాచ్ లకు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు చెందిన ఆటగాళ్లు దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది.

సొంత గడ్డపై న్యూజిలాండ్తో సిరీస్ నేపథ్యంలో తమ ఆటగాళ్లను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెనక్కి లభించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మార్చి 27వ తేదీ నుంచి మే చివరి వరకు ఐపీఎల్ టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

మొత్తంగా 10 జట్టు 64 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈ నిర్ణీత వ్యవధిలోనే ఐపీఎల్ జరిగితే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ఆటగాళ్లు ప్లే ఆఫ్ సమయంలోనే సొంత గుట్టకు బయలుదేరే అవకాశం ఉంది. టెస్టు చాంపియన్షిప్ ప్రాధాన్యత నేపథ్యంలో.. ఆటగాళ్లను ఈ సి బి వెనక్కి రప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా జూన్ 2వ తేదీ నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version