మునుగోడు లో నైతికంగా కేసిఆర్ ఓడిపోయారు – ఈటల రాజేందర్

-

మునుగోడులో నైతికంగా కేసిఆర్ ఓడిపోయారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. మునుగోడు లో గెలిచేది రాజగోపాల్ రెడ్డి అని.. కెసిఆర్ వ్యవహారం నీ మేము కూడా దేశ వ్యాప్తంగా తీసుకెళ్తామని హెచ్చరించారు. అందరూ సీఎం లకు, ప్రతి పక్ష నేతలకు, న్యాయ మూర్తులు కు పంపిస్తామని ఫైర్‌ అయ్యారు.

సీఎం కేసిఆర్ దేశం అదోగతి పాలవుతుంది అని మాట్లాడుతూ… మొసలి కన్నీరు కారుస్తున్నారని.. సీఎం వెల్లడించిన బాధనే మేము తెలంగాణ లో అనుభవిస్తున్నామన్నారు.లక్షలాది మంది ఉద్యమంలో పాల్గొని, వేల మంది ప్రాణాలు అర్పిస్తే రాష్ట్ర ఏర్పడిందని.. కేసిఆర్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యి అపహస్యనికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.

కెసిఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని.. కెసిఆర్ తానే ఒక రాజు, చక్రవర్తి లా రాజ్యం ఏలుతున్నాడని నిప్పులు చెరిగారు.ఆ నలుగురూ ఎమ్మెల్యే లు ఏ విధంగా నిప్పు కనికలు అవుతారో రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు..కాంగ్రెస్ టీడీపీ cpi CPM, నుంచి ఏ పేరుతో ఎమ్మెల్యే ల కొనుగోలు చేసారు? అని ఫైర్ అయ్యారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version