పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా కష్టమే : సీఎం మమతా బెనర్జీ

-

లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఒంటరి పోరుకు సిద్ధమన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ…వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అలాంటిది కాంగ్రెస్ నేతలకు ఎందుకంత అహంకారమని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర బెంగాల్లో అడుగుపెట్టినా తనకు కనీస సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. యూపీ, రాజస్థాన్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని.. అలహాబాద్, వారణాసిలో గెలిచి చూపించాలని ఆమె సవాల్ విసిరారు.

రాహుల్ బీడీ కార్మికులతో ఫొటో దిగిన అంశాన్ని మమత బెనర్జీ ప్రస్తావిస్తూ ఒక్కసారి కూడా టీ దుకాణానికి వెళ్లని వారు ఇప్పుడు బీడీ కార్మికులతో కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్‌పై సీఎం మమతా బెనర్జీ విమర్శలతో విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు మరింత ముదిరేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news