ఈరోజు కూడా బాబు, పవన్ ఢిల్లీలోనే మకాం…. సెటైర్ వేసిన అంబటి రాంబాబు

-

మరి కొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో టీడీపీ – జనసేన కూటమి పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో తుది భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. వారు ఇవాళ రాత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా.. తాజాగా అది రేపటికి వాయిదా పడింది. దీంతో బాబు, పవన్ ఈరోజు రాత్రి కూడా హస్తినలోనే ఉండనున్నారు. రేపు షాతో చర్చల అనంతరం పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మకాం వేయడంపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘మేము ఎన్నికలకు సిద్ధం. మీరు అమిత్ షా ఇంటి ముందు సిద్ధం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news