మీరు చేసే ప్రతి తప్పు.. వీరు చూస్తున్నారని మీకు తెలుసా..?

-

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. ఎవరూ తనను చూడలేదు అనుకుంటుందట.. అలాగే మనిషి కూడా.. చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత . కానీ ..నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు.. అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .

ఎందుకంటే.. మీరు ఏ తప్పు చేస్తున్నా.. చూసేందుకు నిశితంగా గమనించేందుకు మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవేంటో తెలిస్తే.. మీరు సాధారణంగా తప్పులే చేయరు.

అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయసంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి . వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి . ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .

దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు . ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి . అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .

ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి . అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు . ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .

అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు . అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .కానీ ఆవేశం, కోపం,క్షణికావేశం తో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే. అందుకే తప్పు చేసేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news