ప్రజలను మోసం చేయడానికి పవన్ తో కలిసి చంద్రబాబు కుట్ర .. : మాజీ మంత్రి

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమలో ప్రాజెక్టు ల పరిశీలన చేయడానికి పవన్ కళ్యాణ్ తో రానున్న సంగతి తెలిసిందే. ఈ పరిశీలనపై వైసీపీ ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే శంకర్ నారాయణ చంద్రబాబు నాయుడు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ చంద్రబాబు తన దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రాజెక్టు లను పరిశీలించడానికి వెళుతున్నారు. ఇందులో భారీ కుట్ర దాగుందన్నారు.. ఎందుకంటే ఈ ప్రాజెక్టు లలో గొల్లపల్లి, జీడిపల్లి రిజర్వాయర్ లు కట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో అన్నారు శంకర్ నారాయణ. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టును కాస్త తాగునీటి ప్రాజెక్టు గా మార్చేశారు అంటూ శంకర్ నారాయణ విమర్శలు చేశారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ వర్షాలు రాకుండా ఆగిపోతాయంటూ కామెంట్ చేశారు శంకర్ నారాయణ. చంద్రబాబు దత్తపుత్రుడితో కలిసి ఈ రిజర్వాయర్ లను చూడడానికి వస్తే ప్రజలే తగిన బుద్ది చెబుతారని శంకర్ నారాయణ అన్నారు.

ప్రజలను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ లు పెద్ద ప్లాన్ తోనే వస్తున్నారంటూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు శంకర్ నారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version