కలియుగంలో తరించాలంటే ఇలా చేయాలంట !

-

యుగాలల్లో అన్నింటి కంటే కష్టమైనది, సులభమైనది కలియుగం అంటారు. ఈ యుగంలో కలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ అసహజాలను ద్వేషాలు, ద్రోహాలు లేకుండా దాటించగలది భక్తి మార్గం. ముక్తిని పొందేందుకు భక్తి ఒక మార్గము. జీవునికి , దేవునికి మధ్య వారధి భక్తి . కాల ప్రవాహానికి ఒడిదొడుకులకు అతీతమయినది భక్తి . హిందూధర్మ సంస్కృతిలో భక్తి గురించిన విశేషాలు అనేకానేకము ఉన్నాయి . సాధకులు, ఆరాధకులు ఏ విధంగా ఉండాలో మనకు నారదభక్తి సూత్రాలు విపులీకరించాయి. భక్తి తో తన ఇష్ట‌దైవాన్ని ఆరాధిస్తే మనఃశ్శాంతి కలుగుతుంది.

మనసులో చెడు ఆలోచ‌నలకు తావుండదు . . . సన్మార్గ‌ములో నడిచేందుకు వీలుపడుతుంది . ఎన్నో మానసిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చును . నిత్యజీవ‌నంలో ఒత్తిళ్ళకు , ఒడిదొడుకులను తట్టుకునే మనోధైర్యం కలుగుతుంది. మనసు ప్రశాంతం గా ఉంటే శరీరము ఆరోగ్యం గా ఉంటుంది . 80 శాతము శరీరక రుగ్మతలకు మానసిక ఆందోళనే కారణము. భక్తి తో వీటినన్నింటినీ అధిగమించవచ్చు. కర్మ, జ్ఞాన , యోగ మార్గదర్శకమే భక్తి మార్గము . గుణ , రూప , పూజ , సఖ్య , వాత్సల్య , మాధుర్య , ఆత్మనివేధన , తన్మయ, విరహ – ఇలా అనేక భక్తి మార్గాల గురించి నారదభక్తి సూత్రాలు పేర్కొన్నాయి.

ఇక భగవద్గీతలోని అనేక అధ్యాయాలలో భక్తి ప్రాశస్యం మనకు గోచరిస్తుంది . ఉదాహరణకి …. శ్రవణ భక్తి , కీర్తం భక్తి , స్మరణ భక్తి , పాదసేవ భక్తి , వందనభక్తి , దాస్య భక్తి , అర్చనభక్తి , స్నేహభక్తి , అత్మానుసందాన్యభక్తి, మొదలైనవి..
ఆయా భక్తి మార్గాలకు ఆదర్శరూపులైన మహాత్ముల గురించి తెలుసుకుందాం….
భక్తి మార్గంలో ధాన భక్తికి ఒక ప్రత్యేకత ఉంది … త్యాగరాజు , పురందరదాసు మొదలైన వారు భక్తిపారమార్ధ్యాన్ని పానం చేసిన మహనీయులు.

కీర్తన భక్తి కి – రామదాసు , అన్నమయ్య
శ్రవణభక్తికి – గోపికలు, రుక్మిణి,
స్మరణభక్తి కి – నారద, తుంబుర, ప్రహ్లాదులు,
పాదసేవన భక్తి కి – శబరి, భరతుడు, లక్ష్మణుడు,
అర్చన భక్తికి – కన్నప్ప, ఏకలవ్యుడు, నంది,
వందన భక్తి కి – మానవులు,
దాస్య భక్తి కి – హనుమంతుడు , గరుత్మంతుడు,
స్నేహభక్తి కి – సుగ్రీవుడు , విభీషణుడు ,
ఆత్మనివేదన భక్తికి – కుబేరుడు , అర్జునుడు .
భక్తి మార్గము లో విశ్వాసం ఉండాలి. పై మహాత్ములను ఆదర్శంగా తీసుకుని ధర్మమార్గంలో పయనిస్తూ ముక్తిని పొందవచ్చు అని పెద్దలు పేర్కొంటున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news