ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును రాష్ట్ర పోలీసు నియామక మండలి పొడిగించింది. ఇటీవల 61 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా ముందు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ పోస్టులకు ఈనెల 28 లోపు దరఖాస్తు చేసుకోవాలి. వయోపరిమితి రెండేళ్లు సరలింపు నిచ్చిన నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును 2023, జనవరి 7 వరకు పొడిగించింది. ఈ మేరకు పోలీస్ నియామక నోటిఫికేషన్ ను సవరించింది. ఎస్ఐ పోస్టులకు మాత్రం ముందు ఇచ్చిన నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం జనవరి 18 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version