శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్ సైట్లు..!

-

ఏపీలోని శ్రీశైలం పుణ్యక్షేత్రం వద్దకు వచ్చే భక్తులపై  నేరగాళ్లు వల వేశారు. ఆన్ లైన్ రూమ్ ల బుకింగ్ కోసం వెతికే వారినే టార్గెట్ గా వారు డూప్లికేట్ వెబ్ సైట్లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. వారి వెబ్ సైట్ కూడా శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్ మాదిరిగా పోలీ ఉంటుంది. దీంతో వివరాలను నింపగానే సంబంధిత భక్తులకు ఫోన్ చేసి.. వసతి గది కోసం మీరు చేసుకున్న బుకింగ్ కన్ఫర్మ్ అయింది. మీరు వెంటనే మా ఫోన్ నెంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే యూపీఐ పేమెంట్స్ ఆప్షన్లతో డబ్బు చెల్లించండి. ఆ తరువాత మీ గది బుకింగ్ డీటెయిల్స్ పంపిస్తామంటూ సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతారు. 

ఇక పేమెంట్ చేసిన తరువాత ఫేక్ బుకింగ్ నెంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వాస్తవానికి వసతి గది కోసం దేవస్థానం కానీ ఇక్కడి ప్రైవేట్ సత్రాలు ఏపీ టూరిజం వారు కానీ పేమెంట్ కోసం ఫోన్ చేయరు. పేమెంట్ అంతా ఆన్ లైన్ గేట్ వే ద్వారానే జరుగుతుంది. శ్రీశైలం క్షేత్రంలో అర్జిత సేవ టికెట్లు, వసతి గదుల విషయంలో దళారులు అధికమవ్వడంతో వారికి అడ్డుకట్ట వేసేందుకు టికెట్లను ఆన్ లైన్ చేసింది దేవస్థానం.

Read more RELATED
Recommended to you

Latest news