BREAKING : సిలిండర్​ పేలి ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవదహనం

-

హరియాణాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సిలిండర్​ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాపించడం వల్ల పక్క ఇళ్లు కూడా దగ్దమయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.

ఈ ఘటన పానీపత్​ జిల్లాలో జరిగింది. మృతులను అబ్దుల్​ కరీమ్​(50), అఫ్రోజా(46), ఇష్రత్ ఖటుమ్(17), రేష్మా(16), అబ్దుల్ షకూర్(10), అఫాన్​(7)గా పోలీసులు గుర్తించారు. వీరంతా బంగాల్​కు చెందిన ఉత్తర దినాజ్​పుర్​ వాసులని పోలీసులు తెలిపారు. అయితే ఉదయం వంట వండుతున్నప్పుటు గ్యాస్​ లీకై ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు, పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version