నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

-

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనలో 4 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే…. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్ పేట రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఆటోను కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే నలుగురు మంది మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడు గ్రామానికి పొగాకు గ్రేడింగ్ కోసం పనిచేసే కూలీలు ఆటోలో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

car auto
car auto

ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా…. మిగిలిన 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో వారి పరిస్థితి తీవ్ర విషయమంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వారికి వేగంగా చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసాగిస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news