ఇటీవల గుండెపోటుతో మరణాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అన్ని వయసుల వారూ గుండెపోటుకు గురవుతున్నారు. అకస్మాత్తుగా ఉన్నచోటే కుప్పకూలుతున్నారు. చిన్నవారు, యువత కూడా గుండెపోటుకు గురవ్వడం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది.

చాలా మంది ఇప్పటికే డ్యాన్స్ చేస్తూ.. జిమ్ లో వర్కవుట్ చేస్తూ.. ఉన్నచోటే కుప్పకూలిన ఘటనలు చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు.. కాంచన్ బాగ్ ఒవైసీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. కౌన్సిల్ సమావేశం నుండి వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందారు హుస్సేన్.