హైదరాబాద్ ఫీవర్ లో ఆందోళన ఏంటీ…?

-

కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రాల్లో ఫీవర్ సర్వే కాస్త స్పీడ్ గా జరుగుతుంది. హైదరాబాద్ లో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఫీవర్ సర్వే లో బయటపడుతున్న లక్షణాలపై కాస్త ఆందోళన ఉంది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారే అధికం అంటు సర్వే లో వెల్లడి అయింది.

గ్రేటర్లో 2,04,490 ఇళ్ల లో బల్దియా బృందాలు ఫీవర్ సర్వే చేసాయి. ఇప్పటి వరకు గ్రేటర్ హైద్రాబాద్ లో 1,18,8362 ఇళ్ల లో ఫీవర్ సర్వే పూర్తి చేసారు. 317 బస్తీ దవాఖాన లలో ఓ పీ ద్వారా ఈ రోజు 17,301 మందికి పరీక్షలు చేస్తారు. ఇప్పటి వరకు మొత్తం 2,37,188 మందికి ఫీవర్ పరీక్షలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version