కొడుకే వారసుడు అవుతాడా.. కూతుర్లు కారా ? – శ్యామల

-

చిరంజీవి పై ఫైర్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. వారసుడు కొడుకే అవుతాడా.. కూతుర్లు కారా.. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తెలియదని ఫైర్ అయ్యారు. వారసుడు అనేవాళ్ళు కొడుకు అనే ఉద్దేశ్యంలో నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది..మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు.

chiranjeevi SHYAMALA

ఉపాసన అన్నీ చక్కగా నడుతున్నారు..వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కరలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని చురకలు అంటించారు.. ఒక్కరి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతినకూడదు..ఆయన వ్యాఖ్యల వల్ల కొందరికి కోపం వచ్చింది.. సినిమా చూడం అంటున్నారు.. దానివల్ల నిర్మాతకు నష్టం..అని ఆగ్రహించారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువు అని తెలిపారు. విద్యార్ధుల ఇచ్చే పథకాలు ఆపేసి వారి జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం.. గతంలో మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదన్నారు. ఇప్పుడు ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు.ఏపీ అభివృద్ధి జగన్ తోనే సాధ్యం అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version