దారుణం.. శ‌రీరం లోకి గాలి నింపి మ‌రి

-

మ‌నుషుల్లో మాన‌వత్వం రోజు రోజు కు త‌గ్గిపోతుంది. ఒక వ్య‌క్తి శ‌రీరం లో కి కొంత మంది దుర్మార్గులు గాలి నింపి మరి హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఈ నెల 16 న జ‌రిగింది. కానీ ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు చెప్ప‌క పోవ‌డం తో ఆల‌స్యం గా వెలుగు లో కి వ‌చ్చింది. వివ‌రాల్లో కి వెళ్తే.. పశ్చ‌మ బెంగాల్ లో రెహ‌మ‌త్ అనే వ్య‌క్తి ఒక మిల్లు లో నైట్ డ్యూటీ ప‌ని చేస్తాడు. న‌వంబ‌ర్ 16 న కూడా రెహ‌మ‌త్ త‌న ప‌ని కోసం మిల్లు కు వెళ్లాడు.

అయితే అక్క‌డ ఉన్న తోటి ప‌ని వాళ్లు రెహ‌మ‌త్ ను ఆట ప‌ట్టించారు. స‌ర‌దా గా అని రెహ‌మ‌త్ శ‌రీరం లోకి బ‌ల వంతం గా గాలి ని పంపించారు. దీంతో రెహ‌మ‌త్ ఆరోగ్యం రోజు రోజు కు క్షిణించింది. ఒక రోజు హుగ్లీ లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి కుటుంబ సభ్య‌లు త‌ర‌లించారు. ప‌రిస్థి తి విష‌మించ‌డం తో ఒక ప్ర‌యివేటు ఆస్ప‌త్రి కి కూడా తీసుకువెళ్లారు. కానీ అప్ప‌టి కే రెహ‌మ‌త్ ఆరోగ్యం తీవ్రం గా దెబ్బ‌తింది. గాలి శ‌రీరం లో కి వెళ్ల‌డం ద్వారా కాలేయం పూర్తి గా దెబ్బ‌తింద‌ని వైద్యులు తెలిపారు. దీంతో రెహ‌మ‌త్ చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. కాగ మిల్లు లో ఈ దారుణానికి పాల్ప‌డిన వారిని అరెస్టు చేయాల‌ని.. మిల్లు యాజ‌మాన్యం న‌ష్ట పరిహారం ఇవ్వాల‌ని రెహ‌మ‌త్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news