ఫిల్టర్ నీళ్లు కూడా క్లీనింగ్ అవసరం… లేదంటే రిస్క్!

-

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడటంతో పాటు, ఈ వానాకాలంలో సీజనల్ వ్యాధులు కూడా మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో తాగే నీరు చాలా సులభంగా కలుషితం అవుతుంది. మనలో చాలామంది ఫిల్టర్ నీళ్లు తాగుతున్నాం కాబట్టి సురక్షితం అనుకుంటారు. కానీ ఆ ఫిల్టర్లను సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..

భూగర్భ జలాలు కలుషితం: వర్షాకాలంలో భూగర్భ జలాలు పైపుల్లోని నీరు చాలా ఈజీగా కలుషితం అవుతాయి. దీనివల్ల డయేరియా, టైఫాయిడ్ కలరా వంటి ప్రమాదకరమైన కడుపు ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్ లో తాగే నీటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

ఫిల్టర్ నీళ్లయినా సరే.. మరిగించాల్సిందే: మీరు RO లేదా UV వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నప్పటికీ, వానాకాలంలో ఆ నీటిని కూడా 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరగబెట్టి చల్లార్చుకుని తాగడం చాలా మంచిది. ఇక ఫిల్టర్ చేయగా మిగిలిన సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) నీటిని మరిగించడం ద్వారా పూర్తిగా నశించిపోతాయి.

Filtered Water Needs Regular Cleaning Too: Don't Take the Risk
Filtered Water Needs Regular Cleaning Too: Don’t Take the Risk

ప్యూరిఫైయర్ క్యాండిల్స్ చెక్ చేసుకోండి: చాలా ఇళ్లలో వాటర్ ఫిల్టర్లు ఉంటాయే కానీ వాటిని క్రమంతప్పకుండా క్లీన్ చేయరు. మీ ఇంట్లో ఉండే ప్యూరిఫైయర్ క్యాండిల్స్ సమయానికి మారుస్తున్నారో లేదో ఒకసారి చూసుకోండి. ఇక అవి సరిగ్గా లేకపోతే ఫిల్టర్ నీళ్ల ద్వారా కూడా బ్యాక్టీరియా శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.

గోరువెచ్చని నీటితో బోలెడు లాభాలు: వానాకాలంలో వీలైనంత వరకు రోజూ గోరువెచ్చని నీటిని తాగడానికి ప్రయత్నించండి. ఇక ఇది మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

దోమల నివారణ కూడా ముఖ్యమే: నీటితో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యం. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇక దోమలు రాకుండా ఉండేందుకు రాత్రి పూట దోమతెరలు, కిటికీలకు నెట్స్ వాడటం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.

“ఆరోగ్యమే మహాభాగ్యం” అన్నారు పెద్దలు. వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కాచి చల్లార్చిన నీటిని తాగడం మరియు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ఒక్కటే మార్గం.

గమనిక: జ్వరాలు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news