మధ్య ప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

-

మధ్యప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. హార్దా పట్టణంలోని ఓ బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి మంగళవారం ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. బాణసంచా ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగ్సి పడుతున్నాయి. పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి దాదాపు 60 ఇళ్లకు పైగా మంటలు అంటుకున్నట్టు సమాచారం.

ఈ మంటల్లో పలు వాహనాలు సైతం దగ్ధమవుతున్నాయి స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూటివ్ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు వ్యాపిస్తుండడంతో పరిసర ప్రాంతాల్లోని స్థానికులకు అధికారులు ఖాళీ చేస్తున్నారు ఇప్పటివరకు దాదాపు 100 ఇళ్లకు పైగా ఖాళీ చేయించారు అధికారులు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణం ఎంత అనే విషయాలను ఆరా తీస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version