ABIDS : హైదరాబాద్‌ లో కాల్పుల కలకలం…

-

హైదరాబాద్‌లో తుపాకీ కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి. ఎస్బీఐకి చెందిన సెక్యూరిటీ గార్డు రెండు రౌండ్ల కాల్పుల జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే… అబిడ్స్‌ ఎస్బీఐ బ్యాంక్‌ లో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగి సురేందర్‌ పై సెక్యూరిటీ గార్డ్‌ సర్దాన్‌ ఖాన్‌ అనే వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సురేందర్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

దీంతో సర్దార్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు అబిడ్స్‌ పోలీసులు. అయితే… ఈ ఘటనపై అబిడ్స్ ఎసిపి వెంకట్ రెడ్డి స్పందించారు. ఇవాళ మధ్యాహ్నం 3:15 గంటలకు కాల్పులు జరిగాయని… సెక్యూరిటీ గార్డ్ సర్దార్ ఖాన్ మరియు సురేందర్ ఇద్దరు మంచి స్నేహితులు అని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు ఉన్నాయని చెప్పిన ఏసీపీ… సెక్యూరిటీ గార్డ్ తన దగ్గర ఉన్న గన్ తో నే కాల్పులకు తెగబడ్డాడని చెప్పుకొచ్చారు. బాధితుడు సురేందర్ ప్రస్తుతం హైదర్ గూడ అపోలో లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version