కరోనా కలకలం.. మాజీ ఎన్నికల కమిషనర్ కన్నుమూత..!

-

కరోనా మహమ్మారి బారినపడి మహారాష్ట్రకు చెందిన మాజీ ఎన్నికల కమిషనర్, ప్రముఖ రచయిత్రి నీల సత్యనారాయణ్ మరణించారు. 72 ఏండ్ల సత్యనారాయణ్‌ కొన్నిరోజులుగా కరోనా బాధపడుతున్నారు. ఆమె ముంబైలోని సెవన్‌ హిల్స్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు   మరణించారు. 1972 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన నీలా సత్యనారాయణ్‌ 2014, జూలై 5న రిటైర్‌ అయ్యారు.

పదవీ విరమణకు ముందు మహారాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మొదటి మహిళా కమిషనర్‌గా 2009లో నియమితులయ్యారు. రచయిత కూడా అయిన ఆమె పదవీ విరమణ తర్వాత అనేక పుస్తకాలు రాశారు. పలు సినిమాలకు సాహిత్యం కూడా అందించారు ఆమె మృతి పట్ల గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారి సంతాపం తెలిపారు. ఓ బాధ్యత గల అధికారిని, సామాజిక స్పృహ కలిగిన మంచి వ్యక్తిని సమాజం కోల్పోయిందని గవర్నర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version