BREAKING : ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష

-

ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష పడింది. ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్‌ చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్లపాక సాయి బ్రహ్మ అనే వ్యక్తికి నష్టపరిహారం చెల్లించకపోవటంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది.

highcourt
highcourt

కోర్టు ఆదేశించినప్పటికీ సాయి బ్రహ్మకు న్యాయం చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్ సింగ్‌కు నెల రోజుల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిరావుకు 2 వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఐఏఎస్‌ అధికారి రావత్‌కు నెల రోజుల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా, ఏఎంబీ ఇంతియాజ్‌కు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. అధికారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి పిటిషనర్‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news