ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్ కార్నివాల్.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు శాంసంగ్‌ ఫోన్లు..

-

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ కార్నివాల్‌ను నిర్వ‌హిస్తోంది. సోమ‌వారం ఈ సేల్ ప్రారంభం కాగా మార్చి 12వ తేదీ వ‌రకు ఈ సేల్ కొన‌సాగుతుంది. ఇందులో శాంసంగ్ కంపెనీకి చెందిన ఫోన్ల‌పై రాయితీలు, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎఫ్‌41 ఫోన్‌పై 31 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్ రూ.19,999కు బ‌దులుగా రూ.15,499 ధ‌ర‌కు ల‌భిస్తోంది.

flipkart smart phone carnival started

సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్ఈ ఫోన్ రూ.65,999కు బ‌దులుగా రూ.44,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. గెలాక్సీ ఎ71 స్మార్ట్ ఫోన్‌ను రూ.34,999 ధ‌ర‌కు కాకుండా రూ.27,499 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. గెలాక్సీ ఎ31 ఫోన్‌పై 25 శాతం వ‌రకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీన్ని రూ.23,999కు బ‌దులుగా రూ.17,999కు కొన‌వ‌చ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎ21ఎస్ ఫోన్‌పై ఈ సేల్ లో 22 శాతం త‌గ్గింపును పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్ ను రూ.17,999కు బ‌దులుగా రూ.12,999 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. గెలాక్సీ ఎ51 ఫోన్‌పై 19 శాతం త‌గ్గింపును అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను రూ.25,999కు బ‌దులుగా రూ.20,999కు కొన‌వ‌చ్చు. అలాగే ప‌లు ఇత‌ర శాంసంగ్ ఫోన్ల‌పై కూడా ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news