27 మందితో బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

-

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో భారతీయ జనతా పార్టీ దూకుడును పెంచేసింది. ఇప్పటికే ఎన్నికలలో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బిజెపి…తాజాగా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది.కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన 27 మందితో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కో-కన్వీనర్‌గా పీయూష్ గోయల్ నియమించబడ్డరు.

27 మంది సభ్యుల ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్,స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్,కిరణ్ రిజిజు, రాజీవ్ చంద్రశేఖర్, అర్జున్ ముండా తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు కూడా చోటు దక్కింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. మరవైపు కర్ణాటక పార్లమెంట్ ఎన్నికలకు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, కె అన్నామలై రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలతో కలిసి బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version