మోదీ 3.0 మంత్రివర్గంలోకి మాజీ ముఖ్యమంత్రులు

-

ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కేబినేట్లో మాజీ సీఎంలకు అవకాశం కల్పించారు. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హరియాణా మాజీ సీఎం మనోహర్లాల్ ఖట్టర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో వీరు ఎంపీలుగా గెలుపొందిన సంగతి తెలిసిందే. వీరికి ఏ శాఖలు కేటాయిస్తారో తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే… ఊహించినట్టే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రధాని మోదీ క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రిగా నడ్డా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత బీజేపీ పగ్గాలు చేపట్టారు. కొద్దిరోజుల్లో జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు ఆయన విముఖత చూపడంతో మంత్రిగా అవకాశం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news