ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ఎన్‌. సుధాకర్‌రావు

-

ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ చైర్మన్ గా ఉండగా… తాజాగా సుధాకర్ రావుకు బాధ్యతలు అప్పగించారు.

ఈయన గాంధీ మెడికల్ కాలేజీలో ఏండోక్రైనాలజీ విభాగం హెడ్ గా పని చేశారు. 1999 నుంచి 2003 వరకు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు. కాగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా TSRTC ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఇవాళ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పల్లె వెలుగు సర్వీసుల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ లో 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో ఒకరోజు అపరిమిత ప్రయాణ పాస్ టి-24 టికెట్ ను…ఇవాళ పెద్దలకు కేవలం రూ. 75కు, పిల్లలకు రూ. 50 కే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు మాత్రమే ఈ రాయితీలు వర్తిస్తాయని TSRTC పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news