మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బీసీని ప్రకటించాలి – టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ

-

మునుగోడు ఉప ఎన్నికల్లో భువనగిరి టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బీసీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. మునుగోడు నియోజకవర్గం ఏర్పడ్డ నుండి ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడని.. 12 సార్లు రెడ్డి సామాజిక వర్గమే ఎమ్మెల్యేగా ఉన్నారని పేర్కొన్నారు.

మునుగోడు లో బీసీలు 67% ఉన్నారని.. మునుగోడు నియోజకవర్గo లో రెండు లక్షల పైచిక్కుల ఓట్లలో ఎస్సీ ఎస్టీ బీసీలు సుమారు 1,60,000 ఓట్లు ఉన్నాయని చెప్పారు. బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ తాను కూడా ఆశించానని.. అందులో తప్పు లేదని వెల్లడించారు. బీసీలకే గాని , వేరొకరికి టికెట్ ఇచ్చి నా పని చేయడానికి మేము సిద్ధమని తేల్చి చెప్పారు బూర నర్సయ్య గౌడ్. ఉద్యమంలో డబ్బులు ఖర్చు చేశాం కానీ డబ్బులు సంపాదించు కోలేదని వెల్లడించారు బూర నర్సయ్య గౌడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version