ఢిల్లీ రోహిని కోర్టు ఆవరణలో గ్యాంగ్‌ వార్‌ : నలుగురు మృతి

-

దేశ రాజధాని ఢిల్లీ లో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ రోహిని కోర్టు ఆవరణలో గ్యాంగ్‌ వార్‌ చోటు చేసుకుంది. ఈ ఘటన లో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఢిల్లీ రోహిని కోర్టు ఆవరణలో గ్యాంగ్‌ వార్‌ జరిగింది. ఈ ఘటన లో గ్యాంగ్ స్టర్‌ జితేందర్‌ గోగితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు.

రోహిణి కోర్టు లోని రూమ్‌ నెంబర్‌ 207 లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఘటన లో నలుగురు మృతి చెందడంతో పాటు… ఓ లాయర్‌ కు కూడా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఓ కేసు విషయం లో రోహిణి కోర్టు కు గ్యాంగ్‌ స్టర్‌ జితేందర్‌ వచ్చాడు. ఈ నేపథ్యం లోనే గ్యాంగ్‌ స్టర్‌ జితేందర్‌ తో పాటు మరో ముగ్గురు యువకులను కాల్చి చంపారు కొందరు దుండగులు. లాయర్ల మాదిరిగా కోర్టు కు వచ్చిన దుండగులు… వారి పై కాల్పులకు ఒడి గట్టారు. కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌ స్టర్‌ జితేందర్‌ పై కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక ఘటన పై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news