వారం రోజుల్లో ఉచిత కరెంట్, రూ.500కే సిలిండర్: సీఎం రేవంత్ రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు. అలాగే వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని అన్నారు. వచ్చేనెల 15వ తేదీలోపు ప్రతి రైతుకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ వచ్చాక ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని కోస్గి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు . ‘పాలమూరుకు రూ.27వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అని విమర్శించారు. ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జలదోపిడీ కంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే ఎక్కువ దోపిడీ జరిగింది’ అని రేవంత్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news