ప్రభుత్వ కళాశాలల్లో  మధ్యాహ్నం భోజనం ఈ నెల నుంచే..కడియం

-

తెలంగాణ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యార్థులకు ఈ నెల నుంచే మధ్యాహ్న భోజనం అందించడానికి సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు  ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్ల గౌరవ వేతనం 12 నెలల పాటు చెల్లించడానికి సీఎం ఆమోదం తెలిపారని ప్రకటించారు.  రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కడియం శ్రీహరితో పాటు, ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ, ఇతర ఉత్నతాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news