CS నుంచి డీజీపీ దాకా.. బీహార్ ముఠాను కేసీఆర్ దించాడు : రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రాన్ని బీహార్ ముఠాతో సీఎం కేసీఆర్ నింపేస్తున్నాడ‌ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో ఉండే అధికారుల‌పై గానీ ప్ర‌జ‌లపై గానీ సీఎం కేసీఆర్ కు న‌మ్మ‌కం లేద‌ని విమ‌ర్శించారు. అందుకే బీహార్ ముఠాను న‌మ్ముకుంటున్నాడ‌ని అన్నారు. సీఎం కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా న‌మ్మ‌డం లేద‌ని అన్నారు. కాగ బీహార్ లో బంది పోటు ముఠాలు ఉంటాయ‌ని అన్నారు. ఆ బంది పోటు ముఠాలే.. ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాయ‌ని విమ‌ర్శించారు.

ఇప్పుడు ఆ ముఠాల‌నే కేసీఆర్ తెలంగాణ‌లో దింపుతున్నాడ‌ని మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, అలాగే ప్ర‌స్తుతం డీజీపీ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న అంజ‌నీ కుమార్ బీహార్ అని అన్నారు. అలాగే అర‌వింద్, సందీప్ సుల్త‌నీయా కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వారే అని అన్నారు. తాజా గా పీకే ను కూడా కేసీఆర్ బీహార్ నుంచే ప‌ట్టుక‌చ్చాడ‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ కు బీహార్ మూలాలు ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. అందుకే బీహార్ ముఠాల‌పై అంత న‌మ్మ‌కం పెట్టుకున్నాడ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news