ఇండియాకు ఎందుకు రష్యా, ఉక్రెయిన్ కు అధ్యక్షుడు అవ్వోచ్చు- కేసీఆర్ పై తరుణ్ చుగ్ సెటైర్లు

-

ఫ్రంట్ పేరుతో కెసిఆర్ పొలిటికల్ టూరిజం చేస్తున్నారని.. పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్తున్నారని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అంటున్నారు. ఇండియాకు ఎందుకు ఉక్రెయిన్, రష్యాలకు కేసీఆర్ అధ్యక్షుడు అవ్వోచ్చని కేసీఆర్ పై సెటైర్ వేశారు. ఉక్రెయిన్ అధ్యక్ష పదవి త్వరలోనే ఖాళీ అవుతుందని సెటైర్లు వేశారు. ఏ ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్ ను కాపాడలేరని ఆయన అన్నారు. మాకు ఎలాంటి ప్రశాంత్ కిషోర్ అవసరం లేదని తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ ముఖంలో భయం కనిపిస్తుందని.. కుటుంబ పాలన చేసేవారికే వ్యూహ కర్తల అవసరం ఉంటుందని ఆయన విమర్శించారు. మా బూత్ ఇంచార్జిలు బూత్ లను ఎలా గెలవాలో ఆలోచిస్తారు… మాకు పీకేలు అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగే పోరాటం.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కాదు.. కుటుంబ రాజకీయాలకు, తెలంగాణ ప్రజలకు మధ్య అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రధాని అని పగటి కలలు కంటున్నారని.. కేసీఆర్ పోగుట్టుకున్నది తెలంగాణలో అయితే బయట వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ మీద ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేదు.. కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అద్ధంలో తన మోహం చూసుకుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రతీ లెక్క మాదగ్గర ఉందని.. కేసీఆర్ మునిగిపోయే నావ అని ఆయన ఎద్దేవా చేశారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news