హైదరాబాద్ నుంచి షిమ్లా… ప్యాకేజీ వివరాలు మీకోసం..!

-

మీరు సరదాగా టూర్ వేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఈ టూర్ ప్యాకేజీ. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి షిమ్లా టూర్ ప్యాకేజీ అందిస్తోంది. కనుక సరదాగా ఈ ప్రదేశాలను చూసి వచ్చేయచ్చు. ఇక ఈ టూర్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

‘హ్యాపీ హిమాచల్ అండ్ పాపులర్ పంజాబ్’ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ఏప్రిల్ 10న మొదలు అవుతుంది. ఫ్లైట్‌లో అమృత్‌సర్, చండీగఢ్, ధర్మశాల, షిమ్లా మొదలైనవి చూసి వచ్చేయచ్చు. మొదటి రోజు హైదరాబాద్‌లో ఈ టూర్ మొదలు అవుతుంది. ఉదయం 11:10 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే 1:45 గంటలకు చండీగఢ్ చేరుకుంటారు.

హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత రాక్ గార్డెన్, సుఖ్నాలేక్ వంటివి చూడచ్చు. రాత్రికి చండీగఢ్‌లో స్టే చెయ్యాలి. రెండవ రోజు అయితే షిమ్లాకు బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత మాల్ చూడచ్చు. రాత్రికి షిమ్లాలోనే స్టే చెయ్యాలి. మూడో రోజు అయితే కుఫ్రీ సైట్‌సీయింగ్, షిమ్లా లోకల్ సైట్‌సీయింగ్ చూడచ్చు. రాత్రికి షిమ్లాలోనే స్టే చెయ్యాలి.

ఐదో రోజు ధర్మశాల లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి ధర్మశాలలో స్టే చేయాలి. నెక్స్ట్ ఆరో రోజు అమృత్‌సర్‌కు వెళ్ళాలి. ఏడో రోజు జలియన్‌వాలాబాగ్, గోల్డెన్ టెంపుల్ చూడాలి. వాఘా బార్డర్‌కు తరవాత వెళ్లొచ్చు. ఎనిమిదో రోజు సాయంత్రం చండీగఢ్ ఎయిర్‌పోర్టులో 04:15 గంటలకు ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 06:50 గంటలకు హైదరాబాద్ వెళ్తారు. ధర విషయంలోకి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.33,100, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.34,100, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.46,950 చెల్లించాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news