హైదరాబాద్ లో దారుణం… యువతిపై ఆటో డ్రైవర్ల అత్యాచారం

-

హైదరాబాద్ లోొ ఘోరం జరిగింది. గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతంలో ఓయువతిపై అత్యాచారం చేశారు. తేరుకున్న తరువాత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. కోఠి నుంచి జూబ్లీహిల్స్ వెళుతున్న యువతిపై ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు యువతి కోఠి నుంచి జూబ్లీహిల్స్ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. సదరు ఆటో డ్రైవర్ మిగతా తన మిత్రులకు ఫోన్ చేశారు. కోఠి నుంచి జిల్లెలగూడ గాయత్రి నగర్ కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్లు యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటో డ్రైవర్ తో పాటు అతని మిత్రులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న జరిగింది. ఈరోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అత్యాచారం
అత్యాచారం

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు యువకులు అఖిల్,నితిన్, ప్రశాంత్, శీనులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోఠి నుంచి జిల్లెలగూడ వరకు ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో యువతి షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. యువతి నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news