ఆటోలో తీసుకెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్.. ఎక్కడంటే?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల కేసులు, అత్యాచార ఘటనలు భారీగా పెరిగిపోతున్నాయి.ఇటీవల ఏపీలోని సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత సీరియస్ అవ్వగా.. 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు.

తాజాగా తెలంగాణలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు కొందరు దుండగులు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. గుర్తుతెలియని మహిళను ఆటోలో బలవంతంగా తీసుకెళ్లిన నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news