Ganji Chiranjeevi: ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలవబోయే మొదటి సీట్ ఇదే: గంజి చిరంజీవి

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవబోయే మొదటి సీట్ మంగళగిరేనని అని మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి అన్నారు.

మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖం చూసి ప్రజలు ఎవరు ఓటు వేయరని గంజి చిరంజీవి అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ చెప్పారని ఆర్కేకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ఓటమి పాలు కావడం ఖాయమని చెప్పారు. మంగళగిరిలో బీసీలకు వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారని గంజి చిరంజీవి తెలిపారు.

 

బీసీకి వైయస్ జగన్ అవకాశం ఇస్తే ఈర్ష్యతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లారని గంజి చిరంజీవి చెప్పారు. గతంలో మంగళగిరి నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి చేశానని ఆర్కే చెప్పారని గుర్తు చేశారు. కాని ఆర్కే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మరోలా చెబుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సహకరించకపోతే మంగళగిరి నియోజకవర్గంలో అంతగా అభివృద్ధి ఎలా జరిగిందని నిలదీశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటలను మంగళగిరి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news