Minister Ponnam Prabhakar : ఆందోళన వద్దు ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుంది : మంత్రి పొన్నం

-

రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.లాండ్రీ, ధోబీఘాట్‌,సెలూన్‌ లకు విద్యుత్ అధికారులు కనెక్షన్ తీసివేయరని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి హెయిర్ కటింగ్ సెలూన్‌లకు,లాండ్రీలు, ధోబీ ఘాట్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక శాఖ బడ్జెట్‌ను ప్రభుత్వం విడుదల చేయాలని ఈ మేరకు మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news