గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్

-

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఏపీలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాదులో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ ఐ.ఎస్.బి క్యాంపస్ లో క్లాసులకు వెళ్లారు. 14 గంటలు క్యాంపస్ లోనే గడపాల్సి రావడం తో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ లో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించగా ఎమ్మెల్యే వంశీకి కరోనా నిర్ధారణ అయింది. గతంలో కూడా వంశీ కరోనా బారిన పడ్డారు. వంశీ హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని, కోలుకున్న అనంతరం నియోజకవర్గానికి వస్తారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. మరోవైపు అధికార వైసీపీలో కరోనా కలకలం రేపింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version