దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రికార్డు

-

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రికార్డులకెక్కడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ మరోసారి చర్చనీయాంశం కావడం బాధాకరమన్నారు గంటా. ఇటీవల కాలంలో అరాచకాలకు, అవినీతికి, అక్రమాలకు అడ్డాగా మారిన ఆంధ్ర ప్రదేశ్ తాజాగా అదే కోవలో ఈ ఖ్యాతిని దక్కించుకోవడం దురదృష్టకరం అని ఫైర్‌ అయ్యారు.

2004 ముందు ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎంత ఆన్న చర్చ కు పోవడం కూడా వృథానే. ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి, మధ్యతరగతి, సామాన్య ప్రజల జీవితాలు గాల్లో దీపాలు లా మారితే మరోవైపు మా ముఖ్యమంత్రి దేశంలోనే సంపన్నుడు అని చెప్పుకోవడానికి నవ్వాలో, ఏడవాలో తెలియని దుస్థితి అని విమర్శలు చేశారు. అదేదో రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి లోనో, తలసరి ఆదాయం పెంపుదల లోనో, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం లోనో, పారిశ్రామిక అభివృద్ధి లోనో ఉంటుందని ఆశించడం కూడా ఈ ప్రభుత్వం లో నేరమే. కాలమే సమాధానం చెప్పాలి, దేశంలోనే సంపన్న సీఎం జగన్ రెడ్డి పేదల పక్షాన పోరాడతానని చెప్పడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version