కాగ్ ఆడిటర్ జనరల్​ గా గిరీశ్ చంద్ర నియామకం

-

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​(కాగ్)గా గిరీశ్ చంద్ర ముర్మును నియమించింది కేంద్రం. ముర్మును సీఏజీగా నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాజీవ్ మెహర్షి శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో శనివారం రాష్ట్రపతి భవన్​లో ప్రమాణస్వీకారం చేసి ‘కాగ్​’గా బాధ్యతలు స్వీకరించనున్నారు ముర్ము.

gerrsh

జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బుధవారం సాయంత్రం ముర్ము రాజీనామా చేశారు. నూతన కాగ్​గా నియమితులవుతారని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి.అక్టోబర్ 29న జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు తీసుకున్నారు ముర్ము. గుజరాత్​ కేడర్​కు చెందిన ఐఏఎస్​ అధికారి అయిన ముర్ము.. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టక ముందు ఆర్థిక శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version