చిరంజీవి, గరిక పాటి మధ్యలో వర్మ, గోగినేని..!!

-

దత్తాత్రేయ గారు పెట్టిన అలయ్ బలయ్ కార్యక్రమం ముగిసి వారం రోజులు అయ్యింది.కాని ఆరోజు చిరంజీవి , గరిక పాటి మధ్య చెలరేగిన వివాద మంటలు మాత్రం ఆరడం లేదు. దానిలో దూరిన మన కాంట్రవర్సీ స్టార్ రామ్ గోపాల్ వర్మ అందులో ప్రతి  రోజు పెట్రోల్ పోస్తూనే వున్నాడు. ఇక చిరంజీవిని అభిమానించే వారు సోషల్ మీడియాలో, వేదికల్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే వున్నారు. విచిత్రంగా మొదలు పెట్టిన గరిక పాటి, చిరంజీవి ఏమి మాట్లాడటం లేదు.కాని ఇందులొ కొత్త కొత్త వాళ్ళు తమ వేళ్ళు, కాళ్లు పెడుతున్నారు.

 తాజాగా బుధవారం రామ్ గోపాల్ వర్మ, గరికపాటి నరసింహారావు  తన ప్రవచనాల్లో ఆడవాళ్ల వేషధారణ, వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వర్మ వరుస ట్వీట్లు చేశారు. ఆడవాళ్ల దుస్తులు సరిగా వేసుకోవడం లేదని గరిక పాటి చెబితే, వర్మ దాన్ని తప్పుబడుతూ.. ‘‘అత్యాచారాలకు గురికావడంలో మహిళలదే బాధ్యత అని గడ్డిపాటి చెబుతున్నారని కొత్త పాయింట్ పట్టాడు. మహిళలందరూ ఇతడిని బొందపెట్టాలి’’ అని ట్వీట్ చేసి మహిళలను రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా, హిందుత్వం పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్న గరికపాటి నుంచి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.

ఈ గోల ఇలా వుంటే ఇందులో  బిగ్ బాస్ కంటెస్టెంట్,  మానవతావాది అని చెప్పుకొనే బాబూ గోగినేని తన దైన శైలిలో ఇద్దరికి చురకలు అంటించారు. గోగినేని చిరంజీవిని దారుణంగా విమర్శిస్తూ  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘రామ్ గోపాల్ వర్మ గారు ఏమో ఆడవాళ్ళను కించపరిచే గరికపాటిని ఇలా వంగదీసి గుద్దుతున్నారు. అక్కడ చిరంజీవి గారేమో ‘మీ భావాలూ నా భావాలూ దగ్గరగా ఉంటాయి మనం కలిసి భోజనం చేయాలి’ అని గరికపాటితో అంటున్నారు. అలా కలిసేవి ఏ భావాలో మరి? భోజనం అప్పుడు వీరిద్దరూ ఏమి మాట్లాడుకుంటారో!’’ అంటూ వ్యగ్యంగా, వివాదాస్పదంగా ట్వీట్ చేశారు. దీనితో మళ్లీ సోషల్ మీడియాలో అగ్గి రాజుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం గోగినేని పై కామెంట్స్ తో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news