బిగ్ బ్రేకింగ్‌: భారీగా షాక్ ఇచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా పైపైకే..!

-

రెండు రోజుల నుంచి త‌గ్గుతూ వ‌స్తోన్న బంగారం ధ‌ర ఈ రోజు భారీగా పైకెగ‌సి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 22 క్యారెట్ల బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాములకు రూ.520 ర్యాలీ చేసింది. దీంతో ధర రూ.39,130 నుంచి రూ.39,650కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పైపైకి చేరింది. ఏకంగా రూ.520 పరుగులు పెట్టింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,640 నుంచి రూ.43,160కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో ధర రూ.49,500 నుంచి రూ.49,900కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.400 పెరుగుదలతో రూ.41,550కు చేరింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పెరుగుదలతో రూ.40,350కు ఎగసింది. ఇక బంగారం ధ‌ర పెరిగితే వెండి కూడా అదే బాట‌లో న‌డిచింది. కేజీ వెండి ధర రూ.49,900కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news