ఇవాళ తెలంగాణ, ఏపీలో బంగారం ధర ఎలా ఉందంటే..?

-

దేశవ్యాప్తంగా స్వల్పంగా బంగారం ధర తగ్గింది. పసిడి ధర పైపైకి పోతున్నప్పుడే కొనుగోళ్లు ఆపరు. ఇక కాస్త తగ్గిందనగానే మహిళలు జ్యువెల్లరీ షాపులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.52,295గా ఉంది. వెండి ధర సైతం పడిపోయింది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.55,350 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.52,295గా ఉంది. కిలో వెండి ధర రూ.55,350 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,295 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,350గా ఉంది.
వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,295గా ఉంది. కేజీ వెండి ధర రూ.55,350 వద్ద కొనసాగుతోంది.
ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.52,295 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.55,350వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1716 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.49 డాలర్ల వద్ద ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version