దిగివస్తున్న పుత్తడి..రెండోజు తగ్గిన పసిడి ధరలు

-

దేశంలో రికార్డు సృష్టిన బంగారం ధలు నెమ్మదిగా దిగివస్తున్నారు..గత రెండు రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో వ‌రుస‌గా రెండోరోజు బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి..అమెరిక‌న్ డాల‌ర్‌తో పోల్చితే రూపాయి మార‌కం విలువ స్వ‌ల్పంగా బ‌ల‌ప‌డ‌ట‌మే బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి ట్రేడ్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధ‌ర 631 త‌గ్గి 51వేల 367కు చేరింది. ఢిల్లీలో గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధ‌ర 51వేల 998 వ‌ద్ద ముగిసింది. ఇక, వెండి ధ‌ర‌లు కూడా స్వల్పంగా త‌గ్గాయి. కిలో వెండి ధ‌ర 1,681 త‌గ్గి 62వేల 158కి చేరింది. గ‌త ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర 63వేల 839 వ‌ద్ద ముగిసింది.

Read more RELATED
Recommended to you

Latest news