మహిళలకు బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు..51 వేలు క్రాస్‌

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్రంగా యుద్ధం సాగుతోంది. రష్యా ఏకపక్షంగా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటూ పోతోంది. నిన్న ఉదయమే మొదలైన యుద్ధం… ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనులు కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు రష్యాని నిలరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి రష్యాను యుద్ధం ఆపేయాలని కోరింది.

అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాలకు శాపంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ అలాగే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక మన దేశంలో లో మీ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మన తెలంగాణ విషయానికి వస్తే చాలాచోట్ల పెట్రోల్ రేట్ లతోపాటు, బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో బంగారం, వెండి ధరలు ఎలా పెరిగాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1370 పెరిగి రూ. 51,550 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1250 పెరిగి రూ. 47,250 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.2700 పెరిగి రూ. 72,700 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news