సెలూన్ స్పెషల్: బంగారు బ్లేడుతో షేవింగ్.. అవాక్కవ్వాల్సిందే.

-

కరోనా మహమ్మారి వచ్చాక అన్ని వ్యాపారాలు కుదేలైపోయాయి. ప్రజల దగ్గర డబ్బులు లేక విలవిలలాడిపోతున్నారు. దీనివల్ల వ్యాపారాలు మూసుకుపోతున్నాయి. అలాంటి ఇబ్బందులు కలగకూడదనుకున్న ఒక సెలూన్ యజమాని ఏం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొత్తగా మొదలెట్టిన సెలూన్ బాగా నడవడానికి అతడు చేసిన ప్రకటన బాగా పనిచేసింది. అక్కడకి వచ్చే కస్టమర్ల కోసం బంగారు బ్లేడుని చేయించాడు. బంగారు బ్లేడుతో షేవింగ్ చేయడాన్ని ఒక గర్వంగా భావించే అందరూ తన సెలూన్ కి వస్తారని ఆ విధంగా నాలుగు లక్షలు ఖరీదు చేసి మరీ 8తులాల బంగారంతో బ్లేడుని తయారు చేయించాడు.

పుణెలో ఉన్న అవినాష్ బోరుండ్ల అనే ఈ వ్యక్తి ఇలాంటి కొత్తరకం ఆలోచనతో వినియోగదారులని ఆకర్షిస్తున్నాడు. అవినాష్ బోరుండ్ల సెలూన్ ని బీజేపీ ఎంఎల్ ఏ గోపీచంద్ పడవకార్ ప్రారంభించారు. ఈ కొత్త రకం టెక్నిక్ తో వినియోగదారులందరూ అవినాష్ సెలూన్ కి క్యూ కడుతున్నారు. షేవింగ్ కి వందరూపాయలే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version