ఆ ఒక్క ప్రోగ్రాం గొల్లపూడికి మరింత గొప్ప పేరు తీసుకొచ్చింది…..!!!

-

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు మరియు రచయిత అయిన గొల్లపూడి మారుతి రావు నేడు హృదయ సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. నటుడిగా, రచయితగా, కథకుడిగా, సంపాదకుడుగా, వ్యాఖ్యాతగా ఈ విధంగా పలు రకాలుగా మనల్ని అలరించిన గొల్లపూడి, కొద్ది రోజుల క్రితం హృదయ సంబంధిత వ్యాధితో చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స తీసుకున్నారు.

అయితే ఆ సమయంలో ఆయన ఆరోగ్యం బాగానే కుదుటపడిందని భావించారు కుటుంబ సభ్యులు. కాగా నేడు ఒక్కసారిగా ఆయనకు హాస్పిటల్ లొనే గుండెపోటు రావడంతో మరణించినట్లు తెలుస్తోంది. నటుడిగా మంచి పేరుతో కొనసాగుతున్న సమయంలో అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు కోరడంతో ఈటీవీ ఛానల్ లో మనసున మనసై అనే ప్రోగ్రాం కు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ షోకు వచ్చే జంటలను మరియు వారి అభిరుచులు, అలవాట్లను తెలుసుకుంటూ వారికి సరదాగా కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తూ సాగిన షో, అప్పట్లో చాలాకాలం ప్రసారం కావడంతో పాటు మంచి పేరు, రేటింగ్స్ కూడా దక్కించుకుంది.

దానితో ఆయనకు టెలివిజన్ రంగంలో మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అదే ఛానల్ లో అక్కడక్కడా కొన్ని షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి గారు ఆపై వయసు మీదపడడంతో మెల్లగా సినిమాలు మరియు టీవీల్లో కనిపించడం తగ్గించారు. అయితే ఇటీవల కొన్నాళ్లుగా అక్కడక్కడ కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు ఆయన చేస్తూ వస్తున్నారు. ఇప్పటి కాలంలో ఎందరో నటులకు మరియు రచయితలకు ఆదర్శప్రాయుడు గా నిలిచే గొల్లపూడి మారుతి రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు…!!

Read more RELATED
Recommended to you

Latest news