ప్రయాణికులకు గుడ్ న్యూస్….తగ్గిన రైల్వే ఛార్జీలు

-

రైలు ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2020లో ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చిన ప్యాసింజర్ రైళ్లలోని సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను పునరుద్ధరించింది. దీంతో టికెట్ ధరలు 50శాతం వరకూ తగ్గాయి. గతంలో మెము/డెము ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ స్పెషల్స్ మార్చడంతో కనీస టికెట్ ధర రూ.10-రూ.30 ఉండేది. ప్రయాణికుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం తాజాగా ధరలను పునరుద్ధరించింది.

ఇక సవరించిన చార్జీలు ఇవాల తెల్లవారు జాము నుంచి అమల్లోకి వచ్చాయి. కరోనా మహమ్మారి లాక్‌డౌన్ తర్వాత రైల్వేలు వాటి పేర్లను మార్చడం ద్వారా ‘ప్యాసింజర్ రైళ్ల’ను క్రమంగా నిలిపివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news