తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..రెండు రోజుల్లో రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల

-

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 2024, ఆగస్ట్ 15వ తేదీలోపు బ్యాంకుల్లోని 2 లక్షల రూపాయల అప్పు మాఫీకి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రుణ మాఫీకి సంబంధించిన విధివిధానాలను 2 రోజుల్లో విడుదల చేస్తున్నామనిఆయన వెల్లడించారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా.. జూలై 9వ తేదీ ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల చేస్తామని అన్నారు.

ఆగస్టు 15 లోగా పూర్తి చేస్తము..నిధుల సమీకరణ మొదలు అయింది..రేపు రైతు భరోసా పై ఖమ్మం లో అభిప్రాయం సేకరణ ప్రారంభం చేస్తున్నాము..రైతులు, ఉద్యోగులు, మేధావులు, రైతు సంఘాల నేతలు అభిప్రాయం లు తీసుకుంటున్నాము అని పేర్కొన్నారు. నేను ఇంత వరకు రైతు బంధు తీసుకోలేదు చెక్ లు ఇచ్చిన తిరిగి ఇచ్చానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news