GOOD NEWS: ఫైనల్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉదయం 7 నుంచే ప్రారంభం…!

-

క్రికెట్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదరుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియా లో వరల్డ్ కప్ జరుగుతుందని షెడ్యూల్ రాగానే అభిమానులు అంతా ఖచ్చితంగా ఇండియా ఫైనల్ కు చేరుకొని కప్ ను గెలుచుకోవాలని ఆశిస్తున్నారు. అనుకున్న విధంగానే ఇండియా ఫైనల్ చేరింది, ఇప్పుడు మరో రోజు గ్యాప్ లో ఆస్ట్రేలియా తో ఆదివారం ఫైనల్ ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ ను బీసీసీఐ గుజరాత్ లోని అహమ్మదాబాద్ మోదీ స్టేడియం లో జరపనున్నారు. కాగా ఈ మ్యాచ్ ను లైవ్ టెలికాస్ట్ చేసే విషయంలో స్టార్ స్పోర్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ ను ఆదివారం ఉదయం 7 గంటల నుండి లైవ్ చేయనున్నారు.. ఉదయం నుండి భారత వాయుసేన గగనతల విన్యాసాలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్ ను స్వయంగా తిలకించడానికి ప్రధాని నరేంద్ర మోదీ తో పాటుగా దేశంలోని చాలా మంది ప్రముఖులు, సినీ స్టార్లు కూడా రానున్నారు.

మరి ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచి 12 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news