గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు మ‌రోసారి కేంద్ర ప‌ర్యాట‌క శాఖ అవార్డు

-

హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ 2016-17 సంవత్సరానికి ఉత్తమ పర్యాటక కేంద్ర అవార్డును ప్రకటించింది. పర్యాటక స్థలాల్లో ఉత్తమ పౌర సేవల కల్పనకు గాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీకి వ‌రుస‌గా రెండోసారి ఈ ప‌ర్యాట‌క శాఖ‌ అవార్డు ల‌భించింది. ఇదివరకు 2015-16 లోనూ హైద‌రాబాద్‌కు కేంద్ర ప్ర‌భుత్వ‌ ప‌ర్యాట‌క శాఖ అవార్డు వచ్చింది. ఈ అవార్డును ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో రాష్ట్రపతి నుంచి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు హరి చందన, శ్రీనివాస్ రెడ్డి అందుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news